1977లో పంతులమ్మ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రం లో నాయక, నాయకీలు రంగనాథ్ మరియు లక్ష్మి. ఈ చిత్రం విడుదల సమయంలో, నారాయణగూడా లోని విఠల్వాడి లోని మిత్రులు, రచయిత డి.వెంకటరామయ్య గారింట్లో ప్రతి ఆదివారం రచయితల సమావేశాలు నడుస్తుండేవి. కథల పై వాడి వేడి చర్చలు నడుస్తుండేవి. పంతులమ్మ చిత్రానికి వెంకటరామయ్య గారు మాటలు వ్రాసారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం. మా రచయిత మిత్రులం పంతులమ్మ చిత్రానికై చాలకాలంగా వేచియున్నాము. ఆ ఆదివారం వెంకటరామయ్య గారితో కలిసి, అందరం పంతులమ్మ చిత్రం చూసి ఆనందించాము. ఈ చిత్రానికి మధురమైన సంగీతం అందించినవారు రాజన్-నాగేంద్ర. ఈ చిత్రం YouTube లో లభ్యమవుతుంది. నటుడు రంగనాథ్ అంటే తొలుత నాకు గుర్తుకు వచ్చేదీ చిత్రమే.
ఇంటింటి రామాయణం చిత్రం నుంచి నాకు ఇష్టమైన వీణ వేణువైన సరిగమ విన్నావా…..తీగ రాగమైన మధురిమ కన్నావా…(ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు) అనే మాధుర్యమైన పాట వినండి.
రంగనాథ్ కు ఆత్మలు, పునర్జన్మలపై విశ్వాసం లేదు. ఆత్మహత్య పిరికితనం, ప్రాణదానం పౌరుషం, సజీవ సమాధి పరిపూర్ణత్వం అని నమ్ముతారు.
రంగనాథ్ హేతువాది. ఎవరు దేవుడు, ఎవరు బండ అనే వీరి అద్భుతమైన కవిత వినండి.
వారు మరణించారంటే మనసు ఇంకా అంగీకరించటం లేదు. వారి స్మృతి సదా మనసులో ఉంటుంది.
చలనచిత్రాలు: ఆంధ్రజ్యోతి ABN CHANNEL సౌజన్యంతో
Tags: Ranganath
February 17, 2016 at 9:11 pm |
great actor nd humanitarian, RIP.